Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకష్ణ (చిన్నబాబు), సునీల్ నారంగ్, డీవీవీ దానయ్య, రాధాకష్ణ, నవీన్, వంశీ, బాలగోవింద రాజు, డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ,'లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గత రెండు ఏండ్ల నుంచి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కరోనా వేరియంట్లు వచ్చినా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుని, థియేటర్లకు నిర్భయంగా రావొచ్చు. అలాగే థియేటర్ల యాజ మాన్యాలు కూడా ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య', 'భీమ్లా నాయక్' వంటి భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అలాగే వీటి నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని, టికెట్ ధరల పెంపుపై ఒక తుది నిర్ణయం తీసుకుని, ధరలను పెంచి సినిమా రంగాన్ని ఆదుకోవాలని చేసిన నిర్మాత అభ్యర్థనని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరలపై అధ్యయనం చేసి, ఎగ్జిబిటర్లకు గాని, నిర్మాతలకు గాని ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో సీఎంతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటాం' అని తెలిపారు.
కరోనా థర్డ్వేవ్ (ఒమిక్రాన్) వస్తుందన్న ఊహాగానాలు మొదలైన నేపథ్యంలో థియేటర్ల మూత, థియేటర్ల ఆక్యూపెన్సీ తగ్గింపు వంటి అసత్య ప్రచారాలను నమ్మద్దు. అలాగే కరోనా దష్ట్యా థియేటర్లపై ఆంక్షలు విధిస్తామన్న ప్రచారం కూడా అపోహే. టిక్కెట్ల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి, తెలంగాణకు ఎటువంటి సంబంధం ఉండదు.
- తలసాని