Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' (ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా ||రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ని సోనిలివ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్తో దక్కించుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత డా ||రవి ప్రసాద్ రాజు దాట్ల, 'మా బ్యానర్లో తొలి ప్రయత్నంగా నిర్మించిన మా చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. గుహన్గారి మేకింగ్, అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ఫస్ట్ టైమ్ తెలుగులో వస్తున్న కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ ఇది. ఓటీటీకి పర్ఫెక్ట్ ఛాయిస్. సోనిలివ్ ద్వారా మా సినిమా మరింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. త్వరలోనే మా సినిమా సోనిలివ్లో డైరెక్ట్గా విడుదలకానుంది' అని తెలిపారు.