Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించిన చిత్రం 'గమనం'. ఈ సినిమాతో సుజనారావు దర్శకురాలిగా పరిచయమయ్యారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 10న విడుదలై, పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో శ్రియా మాట్లాడుతూ,'ఇందులో పోషించిన కమల పాత్రతో ప్రేమలో పడ్డాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కెమెరామెన్ బాబా గారు. ఇంత మంచి పాత్రను రాసినందుకు దర్శకురాలు సుజనకు థ్యాంక్స్. సాయి మాధవ్గారు రాసిన డైలాగ్స్ అద్భుతంగా వచ్చాయి. ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ఓ మంచి సినిమాని చూశామని ప్రేక్షకులందరూ చెబుతున్నారు. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'ఫీల్ గుడ్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. మంచి సినిమాని చూశామని అందరూ చెబుతున్నారు. అదే మాకు పెద్ద విజయం. నాకు అలీ పాత్రను ఇచ్చినందుకు థ్యాంక్స్' అని హీరో శివ కందుకూరి చెప్పారు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ. 'ఈ ఏడాది ఇప్పటివరకు నేను నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. 'గమనం' వంటి సినిమాతో ఈ ఏడాది ముగుస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాలో అద్బుతమైన పాత్రను ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని అన్నారు.'మా సినిమాని వీక్షించి, ప్రశంసలు కురిపిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇంత మంచి సంగీతాన్ని, ఆర్ఆర్ను ఇచ్చినందుకు ఇళయరాజా గారికి, కెమెరామెన్, నిర్మాత బాబా (జ్ఞానశేఖర్) గారికి థ్యాంక్స్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కమల పాత్రకు శ్రియ జీవం పోశారు. అలీ, ఝారా, మనో భాను పాత్రలు అందర్నీ అద్బుతంగా అలరిస్తున్నాయి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని దర్శకురాలు సుజనరావు తెలిపారు.