Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మా' అధ్యక్షుడు విష్ణు
'ఈ ఏడాది మాదిరిగానే ప్రతి ఏటా డిసెంబర్ రెండో వారంలో 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహిస్తాం. మరో వారం రోజుల్లో 'మా' బిల్డింగ్కి సంబంధించి ప్రకటన చేస్తాం' అని 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. 'మా' ఆధ్వర్యంలో ఆదివారం 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ, 'మెడికవర్ హాస్పిటల్స్, 'మా' అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్లు చేయిస్తున్నాం. ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. మెడికవర్ హాస్పిటల్స్ ఫిల్మ్ జర్నలిస్ట్లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. 'మా' బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల 'మా' కమిటీ మీటింగ్ జరిగింది. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తాం.
రాజీనామాలు ఆమోదం
ప్రకాష్ రాజ్ ప్యానల్లో పోటీ చేసి, గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరాం. కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించాం. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాం. అయితే వీళ్ళతో పాటు నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా కొనసాగుతారు' అని చెప్పారు.
'ఈ హెల్త్ చెకప్లను 'మా' సభ్యులకు చేయటం చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు టెస్టులు చేస్తున్నాం' అని డాక్టర్ అనిల్ (మెడికవర్ హాస్పిటల్స్) తెలిపారు. 'మా' జనరల్ సెక్రటరీ రఘుబాబు మాట్లాడుతూ, 'హెల్త్ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫస్ట్ ప్రయార్టీగా తీసుకుని 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను విష్ణు ఆధ్వర్యంలో చేయబోతున్నాం' అని చెప్పారు. 'మా సభ్యుల ఆరోగ్యం ముఖ్యం. సామాజిక స్పహతో పనిచేస్తున్న మెడికవర్ హాస్పిటల్కి కతజ్ఞతలు' అని 'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి తెలిపారు. ''మా' సభ్యులందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. 'మా' సభ్యుల హెల్త్ కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో 'మా' ప్రెసిడెంట్ విష్ణు సక్సెస్ అయ్యారు అని 'మా' ట్రెజరర్ శివబాలాజీ అన్నారు.