Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, ఆర్య కాంబినేషన్లో విడుదలైన 'ఎనిమి' చిత్రం సూపర్ హిట్ టాక్తో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాను మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. విశాల్ హీరోగా ఎస్.వినోద్కుమార్ మరో సినిమాను నిర్మించ బోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అప్డేట్ను మేకర్లు గురువారం ప్రకటించారు. విశాల్ కెరీర్లో 33వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్కి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ వెల్లడించనుంది.