Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో, హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. హర్రర్ కామెడీగా రూపొందింది. ఇందులో సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. సుందర్ సి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అంతఃపురం' పేరుతో తీసుకొస్తోంది గంగ ఎంటర్టైన్మెంట్స్. రెడ్ జైంట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది. ఈనెల 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్ సి మాట్లాడుతూ, 'మంచి సినిమాలు ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. హర్రర్, కామెడీ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. విజువల్గా హై స్టాండర్డ్స్లో ఉంటుందీ సినిమా. ఈ సినిమాలోని గ్రాండియర్ అందరినీ ఆకట్టు కుంటుంది. ఈ నెల 31న సినిమా విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'తెలుగులో 'చంద్రకళ'గా విడుదలైన 'అరణ్మణై', 'కళావతి'గా విడుదలైన 'అరణ్మణై 2' సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తమిళంలో 'అరణ్మణై 3'కి మంచి స్పందన లభించింది. అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇందులో నటించడం స్పెషల్ అట్రాక్షన్. ఆమె నటించిన ఫస్ట్ హర్రర్ కామెడీ సినిమా ఇది. క్యూట్, బబ్లీ, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్స్ చేసిన ఆమె హర్రర్ కామెడీలో ఎలా చేసి ఉంటారో అని తెలుగు ఆడియన్స్ కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.