Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్ హీరోగా, విజరు సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రం 'మైఖెల్'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. తాజాగా ఈ చిత్రంలో నాయికగా దివ్యాంక కౌశిక్ను మేకర్స్ ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. స్టార్ డైరెక్టర్గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్ల్లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్గా నటించడం విశేషం. అలాగే 'మజిలి' సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న దివ్యాంక కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమెది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. సందీప్ కిషన్ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్ని రెడీ చేశారు. నటీనటుల కెరీర్లో ఇదొక స్పెషల్ సినిమాగా నిలవనుంది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్మోహనరావు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ చెర్రీ.