Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ, 'రంగుల రాట్నం' ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్లో రూపొం దిన సినిమా 'ఉనికి'.
ఎవర్గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇదొక డ్రామా థ్రిల్లర్. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక యువతి, కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలని ముందుకొచ్చిన ఆవిడకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?, వాటిని అధిగమించి ఎలా తన 'ఉనికి'ని చాటుకుంది? అనేది సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా సినిమా ఉంటుంది. ఇప్పటికే సినిమాలోని రెండు పాటలు విడుదల చేశాం. రెండింటికీ మంచి స్పందన లభించింది. ఇటీవల విడుదలైన 'నిప్పు రవ్వ కదిలింది చూడు...' పాటకు విశేష స్పందన లభించింది. అంతకు ముందు హీరో మంచు మనోజ్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరి 26వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నాం' అని అన్నారు.
టీఎన్ఆర్, 'రంగస్థలం' నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ, బండి స్టార్ కిరణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరికష్ణ, సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్), సహ నిర్మాత: అడ్డాల రాజేష్.