Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఓ వృద్ధురాలికి ఆర్థిక సాయం చేస్తూ రవితేజ పోస్టర్ కనిపిస్తున్నారు. దీనికి తగ్గట్టే 'మన గురించి మనం కాకుండా, పక్క వారి గురించి ఆలోచించి సాయం చేస్తే దాని కంటే గొప్ప సంతోషం ఎక్కడా ఉండదు' అని పోస్టర్ మీద రాసి ఉండటం విశేషం.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో మెరవబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత : సుధాకర్ చెరుకూరి, సంగీతం : సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్, ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ.