Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. ఈ నెల 6న చిత్రీకరణ మొదలుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులపై హైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రావు రమేష్, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. దర్శకులు ఇద్దరూ కొత్తవాళ్లు అయినప్పటికీ... ఎక్స్ట్రార్డినరీగా, కాన్ఫిడెంట్గా తెరకెక్కిస్తున్నారు. కెమెరామెన్ సుకుమార్ కూడా అద్భుతమైన అవుట్పుట్ ఇస్తున్నారు. విజువల్గా, టెక్నికల్గా సినిమా చాలా గ్రాండియర్గా ఉంటుంది. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. భారీ బడ్జెట్తో ఈ సినిమా చేస్తున్నాం' అని చెప్పారు.