Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కాలములోని ప్రజలందరికీ శ్రీమద్భగవద్గీత సులభంగా అర్థమవ్వడం కోసం 'శ్రీ లహరి కృష్ణుని గీతామృతం' పేరుతో ఓ ఆడియో సీడీని రూపొందించారు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నా రాయణ శ్రీలహరికష్ణ దివ్య ఆశీస్సులతో ఆదివారం 'శ్రీ లహరికష్ణుని గీతామతం' ఆడియో సీడీ విడుదల కార్యక్రమం గచ్చిబౌలిలోని రాడిసన్ హౌటల్లో ఘనంగా జరిగింది. చెన్నైకు చెందిన వి.జి.పి గ్రూప్ చైర్మన్ డా. వి.జి.సంతోషం చేతుల మీదుగా విడుదలైన ఈ సీడీని నిర్మాత, సంతోషం పత్రిక అధినేత కొండేటి సురేష్, నిర్మాత సాయివెంకట్ అందుకున్నారు. శ్రీమద్భగవద్గీతను ప్రస్తుత కాలములోని జనులందరికీ అర్థమయ్యేలా శ్రీదేవాశీర్ లారిగారు వివరించిన 'అక్షయమైన యోగము' ఉపదేశమును పాటల రూపములో, ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవితంపై అవగాహన కల్పించేలా ఉన్న ఈ పాటల సీడీని శ్రీ సౌందర్యలహరి క్రియేషన్స్, మనుజ్యోతి ఇంటర్నేషనల్ రూపొందించారు.
ఈ వేడుకకు బ్రహ్మశ్రీ పి. మోహన్ గాంధీ అధ్యక్షత వహించగా, మనుజ్యోతి ఆశ్రమ అధ్యక్షులు డి.పి. ఉపాజ్ ఎన్.లారి అతిథులకు ఆహ్వానం పలికారు. ఈ సీడీలోని పాటల గురించి ప్రొడ్యూసర్ లియో పి.సి.లారి వివరించారు. ఉమాపతి నారాయణ శర్మ, డాక్టర్ పి. బంగారయ్య, గంజికుంట్ల రాఘవేంద్ర, ఆవుల ముత్తయ్యతో పాటు పలువురు సినీ, టీవీ నటీనటులు పాల్గొని 'శ్రీమద్భగవద్గీత' ప్రాముఖ్యతని తెలిపారు.