Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న చిత్రం 'రెక్కీ'. కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు అనేది ట్యాగ్లైన్. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో కమలకష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా, హాస్యనటుడు భద్రమ్ సెకండ్ హీరోగా ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు.
అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించారు.
'క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాంశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో, అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న చిత్రమిది. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్ర రూపకల్పనలో నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన సపోర్ట్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా.