Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకసారి కాదు..రెండు సార్లు కాదు.. మూడు సార్లు పాము నన్ను కరిచింది. ఆరు గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను' అని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ తనదైన శైలిలో మీడియాకి చెప్పారు. సోమవారం ఆయన పుట్టినరోజు.
ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'పాన్వేల్లోని నా ఫౌంహౌస్ చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఇక్కడ తరచూ పాములు తిరుగుతుంటాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గదిలో పాము కనిపించింది. అడవుల్లో వదిలేద్దామని దాన్ని పట్టుకుని బయటకు తీసుకువస్తుండగా, అది నా చేతిపై మూడుసార్లు కరిచింది. వెంటనే నా కుటుంబసభ్యులు, వ్యక్తిగత సిబ్బంది నన్ను ఆస్పత్రికి తరలించారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ పాము మళ్లీ కనిపించింది. దాంతో ఫొటో కూడా దిగాను. దాన్ని కూడా నా ఫ్రెండ్గానే భావిస్తున్నా. రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయన దర్శకత్వంలో నేను సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వస్తే నేనెంతో సంతోషిస్తా. ప్రస్తుతం 'టైగర్-3', 'కబీ ఈద్ కబీ దివాలీ' షూటింగ్స్లో ఉన్నా. వీటి తర్వాత 'భజరంగీ భాయిజాన్' సీక్వెల్గా 'పవన్పుత్ర భాయిజాన్'కి రంగం సిద్ధం చేస్తున్నా. దీనికి కూడా రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. అలాగే 'నో ఎంట్రీ' సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంది' అని సల్మాన్ తెలిపారు.