Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుగమ్య శంకర్, నందిని, రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'యజ్ఞ'. మురళీ మూవీ క్రియేషన్స్ బేనర్ పై పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టియఫ్సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకష్ణగౌడ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, శ్రీమతి విజయలక్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండపాక శ్రీరామ మూర్తి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ, 'హర్రర్, రొమాంటిక్ కామెడీ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త, పాత నటీనటులు నటిస్తున్నారు. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు చిత్రీకరణ చేస్తాం. జనవరి 5 నుంచి 15 రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ ప్లాన్ చేశాం' అని అన్నారు.
'దర్శకుడు ప్రసాద్ చెప్పిన కథ నాకెంతో బాగా నచ్చింది. నా గత చిత్రాలన్నీ ఆదిరించారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని నిర్మాత పొందూరి రామ్మోహన్ రావు చెప్పారు. హీరో రాఘవ మాట్లాడుతూ,' ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక. నిర్మాతలకు కతజ్ఞతలు' అని అన్నారు. భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు, కవిత, జబర్దస్త్ అప్పారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.