Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్.ఎస్.నాయక్ అభిరుచిగల దర్శక, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 'ప్రజా హక్కు', 'అంటరానితనం', 'చిరు తేజ్ సింగ్' వంటి లఘు చిత్రాలతోపాటు 'హార్మోన్స్' చిత్రాన్ని డా.ఆనంద్ దర్శకత్వంలో నిర్మించారు. అలాగే పలు సామాజిక సేవా కార్యమ్రాలతోనూ మానవత్వాన్ని చాటుకుని అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రశంసలు పొందిన ఆయన ఇటీవల హఠాన్మరణం చెందారు. ఆయన సేవలకు గుర్తింపుగా మయూరి ఆర్ట్స్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డును ఆయన తమ్ముళ్ళు రమేష్, మహేష్, రవీందర్, జవహర్లకు హైదరాబాద్లో జరిగిన వేడుకలో నిర్మాత సాయి వెంకట్, దర్శకులు డా.ఆనంద్, నటుడు గౌతంరాజు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మయూరి రాధ, దత్తు, సాయి ప్రియ, వసంత్, ఈసీగోపాల్, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొని నిర్మాత నాయక్ సేవలను కొనియాడారు.