Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాట సంచలన విజయం సాధించిన 'మానాడు' సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను టాలీవుడ్లో అగ్రగామి నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ చిత్రానికి ఏషియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది.
శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో, హీరోయిన్లుగా ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించారు. ఈ సై ఫై థ్రిల్లర్ను వెంకట్ ప్రభు తెరకెక్కించారు. సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలైంది. 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్ల నిర్మాణంలో, మరికొన్ని సినిమాల విడుదలతో బిజీగా ఉన్న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 'మానాడు'ను మిగతా భాషల్లో రీమేక్ చేయనుంది. దీనికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.