Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం 'రౌడీ బార్సు'. ఈ చిత్రం ద్వారా దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యాన్ని పురస్కరించుకున్ని ఈ చిత్రాన్ని ఈనెల 14న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు దిల్రాజు, శిరీష్ మాట్లాడుతూ, 'కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వ్యాల్యూస్ని దష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. సంక్రాంతి సందర్భంగా ఈనెల14న ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్పటిలాగే ప్రేక్షకులు మా హీరోని, మా బ్యానర్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆశిష్తో పాటు విక్రమ్ కూడా మంచి పాత్రలో నటించాడు. ఇక అనుపమ పరమేశ్వరన్తో మాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. మా ఎస్వీసీ బ్యానర్లో ఆమె చేసిన మూడో సినిమా ఇది. తనదైన నటనతో మెప్పిస్తుంది. మది సినిమాటోగ్రపీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్గా నిలుస్తాయి' అని అన్నారు.