Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా 'మేజర్' విడుదలకు సిద్దంగా ఉంది. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ను ఫస్ట్ సింగిల్ 'హదయమా..' అనే పాటతో మొదలుపెట్టారు. తెలుగు పాటను అగ్ర కథానాయకుడు మహేష్ బాబు విడుదల చేయగా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'అడివి శేష్, సయీ మంజ్రేకర్ మధ్య రొమాంటిక్గా ఈ పాట కొనసాగనుంది. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మెలోడి ట్యూన్ను అందించగా, సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సరిహద్దుల్లో మేజర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే, అతని కోసం ఎదురు చూసే ప్రేయసి పాడుకున్నట్టుగా ఈ పాట ఉంటుంది. తమ ప్రేమను ఉత్తరాల ద్వారా వ్యక్త పరుచుకునే తీరు అందర్ని ఫిదా చేస్తోంది. అలాగే ఈ లిరికల్ వీడియోలో వారిద్దరి చిన్న నాటి జ్ఞాపకాలను కూడా చూపించారు. ఈ పాటలో మేజర్, ఇషాల మధ్య ప్రేమను అత్యద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మేజర్ సందీప్ బాల్యం దగ్గర్నుంచి వీర మరణం పొందేంత వరకూ చూపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజువల్స్, టీజర్లోని ఎమోషన్స్ సినిమా మీద అంచనాలు పెంచాయి' అని చెప్పారు. శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.