Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రౌడీబార్సు' ట్రైలర్ ఆవిష్కరణలో ఎన్టీఆర్
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం 'రౌడీ బార్సు'. దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి ఆశిష్ (శిరీష్ తనయుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న విడుదల చేస్తున్నారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ప్రేక్షకులకు అడ్వాన్స్గా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇది నాకు నోస్టాలజిక్ డే. ఎందుకంటే 'ఆది' సినిమా సమయంలో దిల్ రాజు, శిరీష్గారితో అసోషియేషన్ ఏర్పడింది. మా శిరీషన్న కొడుకు, సోదర సమానుడు ఆశిష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తన సినిమా ట్రైలర్ను నేను రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆశిష్కి, డైరెక్టర్ శ్రీహర్షకి అభినందనలు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్యక్తి గురించి నేను మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి, మంచి చిత్రాల్లో భాగం కావాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఘన విజయం సాధించాలి. కోవిడ్ సమయంలో విడుదలవుతున్న ఈ సినిమా మంచి సినిమాగా మనకు గుర్తుండిపోవాలని ఆశిస్తున్నాను. 'ప్రేమ దేశం' చూసిన ఎగ్జైట్మెంట్ వచ్చింది. నాకే కాదు. మీ అందరికీ కూడా అలాంటి ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది' అని చెప్పారు.
''మా చిత్ర ట్రైలర్ను విడుదల చేసి, యూనిట్కు అభినందనలు తెలియజేసిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్గారికి థ్యాంక్స్. ఈ సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న మా సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నాం. యూత్ సహా అన్ని వర్గాలకు నచ్చే ఎంటర్టైనర్ ఇది. విక్రమ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు, టీజర్కు మంచి స్పందన వచ్చింది. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది' అని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్నారు.