Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త
నిర్మాణంలో ఓ సినిమా రూపుదిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. గురువారం వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థలు ఈ నూతన చిత్ర అధికారిక ప్రకటనను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. 'తొలిచిత్రంతోనే స్టార్గా ప్రేక్షక హదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారాన్ని చూపించే రీతిలో
ఈ సినిమా ఉండబోతోందని, అలాగేభారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందని రిలీజ్ చేసిన వీడియోని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇదిలా ఉంటే, ధనుష్ హీరోగా తెలుగు, తమిళంలో నిర్మితమవుతున్న 'సార్', నవీన్ పోలిశెట్టి హీరోగా మరో సినిమా, సిద్దు జొన్నలగడ్డ హీరోగా 'డిజే టిల్లు' వంటి తదితర చిత్రాలు సైతం సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో నిర్మితమవుతున్న విషయం తెలిసిందే.