Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏపీలో టిక్కెట్ల ధరలు, థియేటర్లు, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, 24 క్రాప్టుల సినీ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, కరోనా తీవ్రత వల్ల జరుగుతున్న నష్టం.. వంటి తదితర సమస్యల గురించి గురువారం జరిగిన భేటీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అగ్ర కథానాయకుడు చిరంజీవి కూలంకషంగా వివరించారు.
అన్ని సమస్యలను రెండు కోణాల వైపు ఆలోచించి, త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను చూపిస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు చిరంజీవి మీడియాకి తెలిపారు.