Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా, కొరటాల శివ రూపొందిస్తున్న చిత్రం 'ఆచార్య'. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. 'ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్నాం. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేేయటం భావ్యం కాదనిపించింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమా వాయిదా పడటమనేది మెగా అభిమానులకు నిరాశ కలిగించే అంశమే. అయినప్పటికీ ఈ వెయిటింగ్కు తగ్గ ఫలితం గ్యారంటీగా ఉంటుందని చెప్పగలం' అని నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి చెప్పారు.