Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్ నటిస్తున్న తాజా చిత్రం 'సామాన్యుడు'. ఈ యాక్షన్ డ్రామాకు 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనేది ట్యాగ్లైన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నూతన దర్శకుడు తు.ప. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా బుధవారం ఈ చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'టైటిల్కి తగ్గట్టు సినిమాలో విశాల్ కామన్ మ్యాన్గా కనిపించబోతున్నారు. ఒక క్రైమ్ కథను వివరిస్తూ విశాల్ పాత్ర ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంది. 'ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒక దానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణం ఉన్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తాను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్లో చూస్తున్నామన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను' అనే డైలాగ్ సినిమా నేపథ్యం ఏంటో చెబుతోంది. అంతేకాదు ఫుల్ యాక్షన్ మోడ్లో ఈ సినిమా ఉండనుందని కూడా అర్థమవుతుంది. డింపుల్ హయతి, విశాల్ లవ్ స్టోరీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ యూత్ ఆడియెన్స్ను ఫిదా చేసేలా ఉంది. ఇందులో అద్భుతమైన డైలాగ్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫామెన్స్తో విశాల్ అందరినీ ఆకట్టుకున్నారు. సాంకేతికంగానూ ట్రైలర్ ఉన్నతంగా ఉంది. అందర్నీ ఈ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్గా కుదిరాయి. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా.తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.