Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'మైఖేల్'. విజరు సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకుడు.
సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలోని ఓ ముఖ్యపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.
స్టార్ డైరెక్టర్, యాక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో సందీప్ కిషన్ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్ను రెడీ చేశారు. నటీనటులకు తమ కెరీర్లో ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని చిత్ర బృందం తెలిపింది. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కర్ రామ్మోహన్రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.