Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నల్లమల'. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేపథ్యంలో, ఆసక్తికర కథాకథనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.ఎమ్ నిర్మాత.
తాజాగా ఈ చిత్రంలోని 'మన్నిస్తారా మూగజీవులారా..' పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదలచే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడు రవిచరణ్ ఈ పాటను చాలా బాగా చిత్రీకరించారు. అప్పుడప్పుడు ఈ సినిమా ప్రోమోస్ చూస్తుంటాను. కొత్త బ్యాక్డ్రాప్లో చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఎవరా అని వాకబు చేస్తే ఈ బ్యానర్ గురించి తెలిసింది. 'మన్నిస్తారా మూగజీవుల్లారా' పాట ప్రతి లైన్ విని, అర్థం చేసుకుంటే హదయం ద్రవిస్తుంది. జంతువుల పట్ల ఎంత అమానుషంగా ఉంటున్నామో తెలుస్తుంది. అలాగే సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్లో ఉంది. ఇలాంటి సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్న 'నల్లమల' టీమ్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అని చెప్పారు. చలాకీ చంటి, శుభోదయం రాజశేఖర్, చత్రపతి శేఖర్, ముక్కు అవినాష్, శేఖర్ అలీ, అరోహి నాయుడు, అసిరి శ్రీను తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్, నిర్మాత: ఆర్.ఎమ్, సినిమాటోగ్రఫీ: వేణు మురళి, సంగీతం, పాటలు: పి.ఆర్, ఎడిటర్: శివ సర్వాణి, ఆర్ట్: పీవీ రాజు, ఫైట్స్: నబా, విఎఫ్ఎక్స్: విజరు రాజ్.