Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం 'అతడు-ఆమె-ప్రియుడు'. సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి కూనం కష్ణకుమారి సమర్పణలో, రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి భారీ బడ్జెట్తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఫిబ్రవరి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, అగ్ర దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, విజయేంద్రప్రసాద్, దర్శకులు దశరథ్, నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ వేడుకలో చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి వడ్డి, ఈ చిత్రానికి ఛాయాగ్రహణంతోపాటు ఎడిటింగ్ చేసిన మీర్ పాల్గొన్నారు. రచయితగా ఎన్నో సంచలనాలు సష్టించిన యండమూరి దర్శకుడిగా కూడా ఈ చిత్రంతో సంచలనాలకు శ్రీకారం చుట్టాలని అతిథులు ఆకాంక్షించారు.
ఈ చిత్రం కోసం యండమూరి ఎంతో శ్రమించారని, సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయనతో మరికొన్ని చిత్రాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నామన్నారు.ఈ చిత్రానికి కెమెరా, కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.