Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ తుది దశకు చేరుకుంది.
మంగళవారం ఈ చిత్రానికి సంబంధించి రెండు విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'మా చిత్రంపై మాకు ప్రేమ, అలాగే ఇతర చిత్రాలపై అమితమైన గౌరవం కూడా ఉంది. అందుకే మార్చి 25న మా సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మారిన పరిస్థితులను బట్టి మా సినిమాని మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం' అని నిర్మాతలు ప్రకటించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.