Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోహన్బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన సంచలనాత్మక చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్తో కలసి విష్ణు మంచు నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తున్నట్టు మోహన్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు షేర్ చేశారు. 'ఎన్నో భారీ అంచనాలతో రూపొందిన ఈచిత్రాన్ని ఈనెల 18న మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో నటించడమే కాకుండా స్క్రీన్ప్లే బాధ్యతను కూడా మోహన్బాబు నిర్వహించడం విశేషం. ఆయన సమకూర్చిన స్క్రీన్ప్లే సినిమాకి హైలెట్గా నిలువనుంది. అలాగే ఆయన మార్క్ డైైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్, ఊహించని మలుపులతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.