Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, రాధిక శరత్కుమార్, ఊర్వశీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు..' అంటూ సాగే టైటిల్ సాంగ్ను చిత్ర బృందం శుక్రవారం రిలీజ్ చేసింది.
'తన జీవితం అదోలా అవ్వడానికి కారణమైన ఆడవాళ్ల అందరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ను హీరో ఈ పాటలో చూపించారు. తన పెళ్లి కాకపోవడానికి కూడా వారే కారణమంటూ నిందిస్తున్నట్టు కనిపిస్తోంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవీ శ్రీ ప్రసాద్ గానం హైలెట్గా నిలిచింది. ఈ పాటలో శర్వానంద్ మాస్ స్టెప్పులతోపాటు రష్మిక కూడా జత కట్టడం అందర్నీ అలరిస్తోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ని టైటిల్ సాంగ్తో ప్రారంభించడం మంచి ఛాయిస్లా మేకర్స్ భావిస్తున్నారు. మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ను ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్.