Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా రూపొందుతున్న చిత్రం 'శశివదనే'. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, 'ఇప్పటివరకూ 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. అందులో రెండు మాంటేజ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల మీద ప్రేమ, వినోదాత్మక సన్నివేశాలు తీశాం. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్లో ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న రఘు కుంచె, శ్రీమాన్, 'రంగస్థలం' మహేష్ జాయిన్ అవుతారు. గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఇది. లవ్ సీన్స్ చాలా కొత్తగా, యూనిక్గా ఉంటాయి. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు సినిమాని చాలా గ్రాండియర్గా, హై స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు చూసి, మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మ్యూజిక్, విజువల్స్ హైలెట్ అవుతాయి. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని చెప్పారు.
సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు ప్రిన్స్ దీపక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్, కాస్ట్యూమ్స్ - సమర్పణ: గౌరీ నాయుడు, నిర్మాత: అహితేజ బెల్లంకొండ, రచన - దర్శకత్వం: సాయిమోహన్ ఉబ్బన.