Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై 'స్టైల్', 'స్నేహగీతం', 'కష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' వంటి హిట్ చిత్రాలను నిర్మించి, అభిరుచిగల నిర్మాతగా ఇండిస్టీలో లగడపాటి శ్రీధర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన సినిమా 'వర్జిన్ స్టోరి'. కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక. ప్రదీప్.బి. అట్లూరి దర్శకుడు. ఈ నెల 18న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారంయ మీడియాతో ఈ చిత్ర విశేషాలను నిర్మాత లగడపాటి శ్రీధర్ షేర్ చేసుకున్నారు.
'తెలుగులో యూత్ సినిమాలు అని చెబుతుంటారు. అయితే అలాంటి సినిమాలు మన దగ్గర రావు. యూత్ సినిమా అంటే టీనేజ్ కథలు చూపించకుండా పెద్దవాళ్ల లవ్ స్టోరీలు చూపిస్తారు. 16 ఏళ్ల యువతీ యువకుల మనోభావాలను తెరకెక్కించే చిత్రాలు మన దగ్గర రాలేదు. ఈ సినిమాలో ఆ ప్రయత్నం చేశాం. యుక్తవయసులో ఉండే అమ్మాయి, అబ్బాయి జీవితంలో ఒక రొమాన్స్ మొదలవుతుంది. మనం నిజంగా ప్రేమించిన వ్యక్తి సన్నిహితంగా ఉన్నప్పుడు మనసు, శరీరం నిజాయితీగా స్పందిస్తాయి. ప్రేమ లేని వాళ్ల దగ్గర ఆ ఫీలింగ్ రాదు. యువత అలాంటి జోడిని ఎంపిక చేసుకోవాలని చెప్పే చిత్రమిది. మీకు నిజంగా ఫీలింగ్ లేనప్పుడు ప్రేమించి కూడా వథా. ఒక్కమాటలో చెప్పాలంటే అసలైన ప్రేమకు పరీక్ష పెట్టే సినిమా. యువత జీవితంలో రొమాన్స్ ఉండాలి. 'స్టైల్' సినిమా కథ విని వెంటనే షూటింగ్కి వెళ్లండని చెప్పాను. అలా బౌండ్ స్క్రిప్టుతో వచ్చిన సినిమా ఇది. వెంటనే ఓకే చెప్పాను. టీనేజ్ వాళ్లకే కాదు అలాంటి మనసు ఉన్న పెద్ద వాళ్లకూ ఈ సినినమా నచ్చుతుంది. పిల్లల్ని అర్థం చేసుకోవాలి అనుకున్న పెద్ద వాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. విక్రమ్ సహిదేవ్ మా అబ్బాయి అని ఈ సినిమా చేయలేదు. తనలో నటుడిగా పేరు తెచ్చుకోవాలనే ఆసక్తి ఉంది. ఇప్పటికే బయట బ్యానర్లలో క్రేజీ చిత్రాల్లో నటించాడు. ఈ సినిమాతోనూ తనకి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ కథని దర్శకుడు చాలా అద్భుతంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా తెరకెక్కించారు. ఈనెల 18న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం' అని నిర్మాత లగడపాటి శ్రీధర్ చెప్పారు.a