Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో బాలయ్య107వ సినిమాగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందు తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు సిరిసిల్ల టౌన్ (తెలంగాణ)లో ప్రారంభమైంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్తో షూటింగ్ని మేకర్స్ మొదలుపెట్టారు.
బాలకష్ణ, ఫైటర్స్పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. 'మాస్ హీరో, మాస్ దర్శకుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్కి ఈ సినిమాతో మంచి ట్రీట్ ఇవ్వనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. బాలకష్ణ సరసన శతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజరు తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. బాలకష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీని ఎంపిక చేశారు. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలీ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.