Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించటానికి చిత్ర బందం సన్నాహాలు ఆరంభించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో ఈ ఈనెల 21 సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.
అలాగే రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారని, అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బందం అంతా పాల్గొననుందని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది.