Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్' సినిమాతో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా, కరిష్మా హీరోయిన్గా చరణ్ రోరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం 'రోరి'. ఈ చిత్రాన్ని సిటిఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ వంటి హేమాహేమీలతో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత, హీరో చరణ్ రోరి పుట్టినరోజు సందర్బంగా బుధవారం ఈ చిత్ర ఫస్ట్లుక్ని అగ్ర దర్శకుడు మారుతి విడుదల చేసి, చరణ్ రోరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా చరణ్ రోరి మాట్లాడుతూ,' ఈ మాత్ర ఫస్ట్లుక్ని మా శ్రేయాభిలాషులు దర్శకుడు మారుతి గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ జరిగే ఓ కుర్రాడి కధ. అనుకోని పరిస్థుతుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ని వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ కొంతమంది హిందువులను కలిసి, వారి కష్టాలు తెలుసుకుని, వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. త్వరలో టీజర్, ట్రైలర్ని విడుదల చేస్తాం' అని అన్నారు. కాదంబరి కిరణ్కుమార్, సూర్య, ముఖ్తారాన్, బ్యాంక్ సూర్య, చరణ్దీప్, ఫణికాంత్, వేణుగోపాల్, ప్రసన్న, రవిప్రకాష్, ఆలీ రెజా, సమ్మెట గాంధి, రాజశేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్.. భీమ్స్ సిసిరొలియో, సినిమాటోగ్రఫీ : దాశరధి శివేంద్ర, ఎడిటర్ :కార్తిక్ శ్రీనివాస్, ఆర్ట్ : హరిక పొట్ట.