Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు, దివంగత కథానాయకుడు పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్'. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. పునీత్ రాజ్కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 17న ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హీరో శ్రీకాంత్, విజరు.ఎం సంయుక్తంగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
పునీత్ రాజ్కుమార్ ఆర్మీ ఆఫీసర్గా నటించిన ఈ చిత్రంలో నాయికగా ప్రియా ఆనంద్ నటించగా, ప్రతినాయకుడిగా హీరో శ్రీకాంత్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎం. విజరు మాట్లాడుతూ, 'పునీత్రాజ్కుమార్పై ఉన్న ప్రేమ, గౌరవంతో ఆయన జయంతి రోజున మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్గా విడుదల చేసిన 'ట్రేడ్ మార్క్' లిరికల్ వీడియో సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ని సొంతం చేసుకున్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది' అని అన్నారు.
డాక్టర్ శివ రాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చరణ్ రాజ్, సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ, ఆర్ట్: రవి శాంతేహైక్లు, ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్, నిర్మాత: కిశోర్ పత్తికొండ, దర్శకత్వం: చేతన్ కుమార్.