Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా, సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన బహుభాషా చిత్రం 'సేవాదాస్'.
సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో, హీరోయిన్లుగా నటించారు. బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుమన్, భానుచందర్ మాట్లాడుతూ, 'బంజారా సంస్కతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ చిత్రంలో నటించడం గర్వంగా ఉంది. 64 దేశాల్లో ఉన్న 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హదయాలకు హత్తుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందిస్తున్నాం' అని అన్నారు. 'ఏప్రిల్ 1న రిలీజ్ అవుతున్న మా సినిమా సంచలన విజయం సాధించడం ఖాయం' అని హీరో, డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ తెలిపారు. నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-బాలు చౌహాన్ మాట్లాడుతూ.' ఈ చిత్ర రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు. ఓ మంచి సినిమాని నిర్మించామనే సంతృప్తితో ఉన్నాం. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది' అని చెప్పారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల నాయికలు వినోద్ రైనా, రేఖా నిరోష సంతోషం వ్యక్తం చేశారు.
ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజరు రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.