Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు నితిన్ తాజాగా నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తయ్యింది.
అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కథానాయకుడు నితిన్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ని తన అభిమానులు, ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.
'అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. జానీ మాస్టర్ సాంగ్ కూడా కంప్లీట్ చేశాం. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అప్డేట్స్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం' అని ట్వీట్లో నితిన్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో నితిన్ సరసన కతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇద్దరు కథానాయికలతో నితిన్ నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. పొలిటికల్ ఎలిమెంట్స్తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అత్యుత్తమ అనుభవం ఉన్న సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు. అలాగే 'భీష్మ', 'మాస్ట్రో' తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్తో కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి, డిఓపి : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: జి.హరి, సంభాషణలు: మామిడాల తిరుపతి, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.