Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు శంకర్, బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా జి.సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'యంగ్ టీమ్ అందరు కలిసి చేసిన ఈ సినిమా టీజర్ని లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. టీజర్ చాలా బాగుంది. ఇప్పుడొస్తున్న వాళ్ళంతా ఓ ఫ్రెష్నెస్ కోసం తపన పడుతున్నారు. ఆ తపన ఈ టీమ్లోనూ కనిపించింది. హీరో విజరుశంకర్, దర్శకుడు సూర్యతేజతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
'శేఖర్ కమ్ముల గారు మా మూవీ టీజర్ని రిలీజ్ చేయటం మోస్ట్ హ్యాపీ మూమెంట్. ఆయన ఎప్పుడు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తుంటారని మరోసారి రుజువైంది. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ తీసుకుని దర్శకుడు సూర్యతేజ ఈ సినిమాని తెరకెక్కించారు. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను' అని హీరో విజరు శంకర్ చెప్పారు. దర్శకుడు జి. సూర్యతేజ మాట్లాడుతూ, 'శేఖర్ కమ్ములగారి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు, నా మొదటి సినిమా టీజర్ను ఆయన రిలీజ్ చేయడం వెరీ హ్యాపీ. 'ఫోకస్' అనేది వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్. రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్కి భిన్నంగా కొత్త తరహాలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. విజరు శంకర్, అషురెడ్డి, సుహాసిని, భానుచందర్, జీవా, షియాజీ షిండే, సూర్య భగవాన్ ఇలా.. చాలా మంది పేరున్న ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఏప్రిల్ మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.
'ఓ మంచి కంటెంట్తో ఈ సినిమా చేస్తున్నాం. మా సినిమా టీజర్ బాగుందని అభినందించిన శేఖర్కమ్ములగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. టీజర్ మాదిరిగానే సినిమా కూడా ఆద్యంతం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది' అని నిర్మాత వీరభద్రరావు అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: సత్య. జీ, డీఓపీ: జె.ప్రభాకర్ రెడ్డి, సంగీతం: వినోద్ యజమాన్య, లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్.