Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్,ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సర్కారు వారి పాట'. ఈ చిత్రంలోని సెకెండ్ సింగిల్ 'పెన్నీ..' ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహేష్బాబు ఫ్యాన్స్తోపాటు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసేలా చిత్ర బృందం శనివారం పాట ప్రోమోను విడుదల చేసింది.
'ఇది రెగ్యులర్ ప్రోమో కాదు, ఎందుకంటే ఇందులో మహేష్ బాబు తనయ సితార ఘట్టమనేని కూడా ఉంది. మ్యూజిక్ వీడియోలో సితార కనిపించడం ఇదే తొలిసారి. మహేష్ బాబు స్టైలిష్, సితార క్యూట్ ట్రెండీ నత్యరీతులతో ఈ ప్రొమో మంత్రముగ్ధులను చేస్తోంది. ఆమె డాన్స్తో పాటు మహేష్ బాబు కూడా కనిపించడం అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఇది కేవలం ప్రోమో మాత్రమే. పూర్తి పాటలో సితార అద్భుతమైన డాన్స్తో అంచనాలు పెంచనుంది. పూర్తి పాటను నేడు (ఆదివారం) మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇది వెండితెరపై అభిమానులకు ఫీస్ట్లా ఉంటుంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. నిర్మాణాంతర పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. తమన్ చక్కటి బాణీలు అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'కళావతి..' ఇప్పటికీ మ్యూజిక్ చార్ట్స్లో అగ్రస్థానంలో ఉంది. దీంతో లేటెస్ట్గా విడుదలవ్వబోయే 'పెన్నీ..' సాంగ్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీనికితోడు మహేష్బాబు తనయ సితార కూడా అదిరిపోయే స్టెప్పులతో మెరవనుండటంతో ఈ పాట కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఏఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. వేసవి ఆకర్షణగా ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది' అని చిత్ర బృందం తెలిపింది.
వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: పరశురాం పెట్ల,
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సంగీత దర్శకుడు: తమన్ ఎస్ఎస్, సినిమాటోగ్రఫీ: ఆర్ మధి, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్.