Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించి దర్శకుడిగా సతీష్ వేగేశ్న టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 'కథలు (మీవి మావి)' అనే వెబ్ సిరీస్ రూపకల్పనతో ఉత్తమాభిరుచిగల దర్శకుడిగా పేరొందిన సతీష్ వేగేశ్న ఓటీటీ ఫ్లాట్ఫామ్లోకి అడుగిడుతున్నారు.
ప్రస్తుతం 'కోతి కొమ్మచ్చి', 'శ్రీ శ్రీ శ్రీ రాజా వారు' సినిమాలు చేస్తున్న ఆయన పక్కా పల్లెటూరి కథలతో ఈ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆయన మార్క్తో ఆంథాలజీగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూడు కథలకు సంబంధించి షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన కథలు షూట్ చేసి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన సినిమాలు తీసి దర్శకుడిగా మెప్పించిన వేగేశ్న సతీష్ ఈ వెబ్సిరీస్తో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా చూసేలా ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ కోసం ప్రముఖ నటీ నటులు అలాగే సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.