Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ స్క్రీన్పై ఇప్పటి వరకు రానటువంటి ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో, భిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శతి'. మనిషి చర్మాన్ని వలిచి బిజినెస్ చేసే గ్యాంగ్తో ఓ యువతి చేసే పోరాటమే తమ చిత్రం అని అంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయిక హన్సిక టైటిల్ రోల్ పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ హన్సిక చెప్పే డైలాగ్తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. మహిళా ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు.
మంగళవారం ఈ చిత్రంలోని 'రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత.. తప్పే చేసే లాగా ముప్పే వచ్చే నా వెంట' అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. మార్క్రాబీన్ సంగీత దర్శకత్వంలో కష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ ఆలపించారు. 'ఈ చిత్రంలో నటించినందుకు ఎంతో ఆనందంగా ఎంది. ఇలాంటి ఓ ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో ఉండే ట్విస్ట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. టైటిల్ సాంగ్తో పాటు సినిమా కూడా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని నాయిక హన్సిక అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ, 'టీజర్ ఆద్యంతం ఆసక్తిగా ఉండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు. 'సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ...ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్లతో ఉంటుంది' అని దర్శకుడు అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్ప్రొడ్యూసర్: విజరుకుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్కుమార్ బండి, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.