Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిబిసి స్టూడియోస్, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి జీ5 'గాలివాన' అనే ఒరిజినల్ సిరీస్గా నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో ముఖ్య పాత్ర పోషించిన రాధిక శరత్ కుమార్ క్యారెక్టర్ ప్రోమోను సీనియర్ నటి కుష్బూ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 'రాధికా శరత్ కుమార్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రోమోను చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జీవితంలో మనకు ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ నిజమైన కష్టం ఏమిటో.. తెలుసా శ్రావణి? ఏ.. కొడుకునైతే నవమాసాలు మోసి కన్నానో.. వాడికి కర్మ కాండలు జరిపించడం.
నా కొడుకు, కోడలును చంపిన వాడు బ్రతకకూడదు.. అని చెప్పే డైలాగ్లు ఫ్యామిలీ, రివెంజ్ డ్రామాగా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కినట్లు ప్రేక్షకులకు అర్థమవుతుంది. రాధిక చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ యూట్యూబ్లో సంచలనం సస్టిస్తూ, మంచి వ్యూస్ సొంతం చేసుకున్నాయి. గతంలో కూడా ఎన్నో ఫ్యామిలీ రివెంజ్ డ్రామా కథలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని విజయం సాధించాయి. ఆ కోవలో ఈ 'గాలివాన' కూడా సక్సెస్ సాధిస్తుందని దర్శక, నిర్మాతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ వెబ్ సిరీస్ను వీక్షకుల కోసం ఏప్రిల్ 14 న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు' అని మేకర్స్ తెలిపారు.
సాయికుమార్, రాధిక శరత్కుమార్, నందిని రారు, చాందిని చౌదరి, చ్కెతన్య కష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్, అర్మాన్, శరణ్య ప్రదీప్, ఆర్. రమేష్, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్, సతీష్ సారిపల్లి, నానాజీ, నవీన్, సూర్య శ్రీనివాస్, జయచంద్ర తదితరులు నటిస్తున్న ఈ వెబ్సిరీస్కి దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ : సుజాత సిద్దార్థ, ప్రొడ్యూసర్ : శరత్ మరార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : నీలిమా మరార్, ప్రాజెక్ట్ హెడ్ : కీర్తి మన్నె.