Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఫిక్షన్, యాక్షన్ ఎంటర్టైనర్ 'దర్జా'. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సలీమ్ మాలిక్ దర్శకుడిగా శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో - ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ను నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, ఏపీ ఆక్వా అసోసియేషన్ చైర్మెన్ భూమాల శ్రీరామ్ మూర్తి, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటితో పాటు షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), హీరోయిన్ శిరీష, సంగీత దర్శకుడు రాప్రాక్ షకీల్, సినిమాటోగ్రాఫర్ దర్శన్, స్క్రిఫ్ట్ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, రైటర్ భవాని ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కో -ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ, 'మా టీజర్ను రిలీజ్ చేసిన సురేష్ బాబు గారికి, అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి థ్యాంక్స్' అని చెప్పారు.