Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సభ్యుల సంక్షేమం, వారికి అండగా ఉండటమే లక్ష్యంగా ఈనెల 10న జరిగే తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ ఎన్నికల్లో మా ప్యానెల్ పోటీ చేస్తోంది' అని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జె.సాంబశివరావు అన్నారు. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ అనేది చాలా కీలకం. ఈ అసోసియేషన్కి సంబంధించిన ఎన్నికలు ఈనెల 10న జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా జె.సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా కె. సతీష్ కుమార్, ట్రెజరర్ అభ్యర్థిగా జి.హరినాథ్ (ప్రియమణి), వైస్ ప్రెసిడెంట్లుగా అట్లూరి సురేష్ బాబు, యస్. వెంకటరత్నం (వెంకట్), జాయింట్ సెక్రెటరీస్గా వాసిరెడ్డి సాయిబాబు (సాయి), కే.శ్రీనివాసులు రాజు (ఎర్ర శీను), ఆర్గనైజింగ్ సెక్రెటరీస్గా పి. అంజయ్య, పి.శ్రీనివాస రావు (క్రేన్ వాసు), ఎగ్జిక్యూటివ్స్ కమిటీ మెంబెర్స్గా తన్నీరు రామకష్ణ, బెక్కం రవీంద్ర, శ్రీమతి దీప్తి, ఆవుల బాలరాజు, యం.కే.వి.శర్మ, యన్.మహేంద్ర రెడ్డి, సి.హెచ్.సీతారాములు (రవి వర్మ), ఎస్.కష్ణ (పిట్టల కష్ణ), బి.శ్రవణ్ కుమార్ గౌడ్ పోటీ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సభ్యులందరూ తమ అమూల్యమైన ఓటును తమ ప్యానల్ సభ్యులకు వేసి, అఖండ మెజారిటీతో గెలిపించాలని అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జె.సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.