Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'శ్రీదేవి శోభన్ బాబు'. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి గుడ్ ఫ్రైడే సందర్భంగా 'నిను చూశాక..' అనే పాటను యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ విడుదల చేశారు.
'నిను చూశాక...' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ను సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ (జాను ఫేమ్) పై చిత్రీకరించారు. కమ్రాన్ సంగీత సారథ్యం వహించిన ఈ పాటకు అద్భుతమైన ట్యూన్ని కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను జునైద్ కుమార్ అత్యద్భుతంగా ఆలపించారు. యువ హీరో సాయిధరమ్తేజ్ రిలీజ్ చేసిన ఈ పాటకు సర్వత్రా అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు వేర్వేరు మనస్తత్వాలున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే సంఘర్షణ, ప్రేమ వంటి ఎలిమెంట్స్ను ఈ సినిమా తెలియజేస్తుంది. శరణ్య పొట్ల ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శశిధర్ రెడ్డి ఎడిటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా దత్తాత్రేయ, భాషా విజువల్స్ ఎఫెక్ట్స్, పొలాకి విజరు కొరియోగ్రఫర్గా వర్క్ చేశారు. సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే కాస్ట్యూమ్స్ డిజైనర్గానూ వర్క్ చేస్తున్నారు.