Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 'మహానట'ి, 'జెర్సీ', 'ఎవరు', 'శ్యామ్ సింగరారు' లాంటి సూపర్హిట్ చిత్రాలకు పనిచేసిన అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో 7 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో 70వ దశకం నాటి స్టూవర్టుపురం సెట్ని శంషా బాద్ సమీపంలోని 5 ఎకరాల్లో రూపొందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమిది. స్టువర్ట్పురం రాబిన్ హుడ్గా పేరొందిన 'టైగర్ నాగేశ్వరరావు' జీవితం ఆధారంగా 70వ దశకం నాటి స్టువర్ట్పురం నేపఝథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆర్ మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.