Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, ఆయన తనయుడు రామ్చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 29న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, ''ఆచార్య' సినిమా ఎనౌన్స్మెంట్ రోజు నుంచి మెగా ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అందరూ చిరంజీవి, రామ్ చరణ్ పూర్తిస్థాయి చిత్రంలో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూశారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ను బట్టే సినిమాపై ఉన్న అంచనాలను ఊహించాం. ఎక్స్పెక్టేషన్స్ను మించేలా సినిమాను రూపొందించాం. అలాగే ఈనెల 23న గ్రాండ్ లెవల్లో హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నాం. ఈ సినిమాలోని సన్నివేశాల్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ల నటన, డాన్సులు, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా అన్ని ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. ఈనెల 29న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.