Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అర్జున్ రెడ్డి' సినిమాతో తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను 'కబీర్సింగ్' పేరుతో రణ్బీర్ కపూర్తో రీమేక్ చేసి బాలీవుడ్లోనూ సత్తా చాటారు.
లేటెస్ట్గా ఇదే కాంబినేషన్లో బాలీవుడ్లో మరో సినిమా ఆరంభమైంది.
భూషణ్కుమార్, ప్రణవ్రెడ్డి వంగ సంయుక్తంగా ఈ చిత్రాన్ని టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.
కథానాయకుడి పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి 'యానిమల్' అనే టైటిల్ పెట్టారు. 'భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు. రణబీర్ కపూర్ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్గా మేకోవర్ అయ్యారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే హిమాలయాల్లో మొదలైంది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11న రిలీజ్ చేయబోతున్నారు. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్లో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.