Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ కలిసి నిర్మించిన చిత్రం 'శ్రీదేవి శోభన్ బాబు'. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల జరిగిన 'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చిరంజీవి, రామ్చరణ్ సంయుక్తంగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మాట్లాడుతూ,'రెండు నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్ చూస్తే శోభన్ బాబుగా సంతోష్ శోభన్, శ్రీదేవిగా గౌరి జి కిషన్ కనిపించారు. సంతోష్ ఎక్కువగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తే, హీరోయిన్ గౌరి షార్ట్ టెంపర్ ఉన్న అమ్మాయిగా కనిపించింది.వీరిద్దరి తీరు చూస్తుంటే భిన్న మనస్తత్వాల మధ్య జరిగే ప్రేమ కథ అని అర్థమవుతుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వారి మధ్య జరిగే సంఘర్షణ ప్రధానంగా సినిమా సాగుతుంది' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శరణ్య పొట్ల, సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ్ రామస్వామి, ఎడిటర్ : శశిధర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ : దత్తాత్రేయ, విజువల్ ఎఫెక్ట్స్ : భాషా, కొరియోగ్రఫీ : పొలాకి విజరు. ఈ సినిమాకి సుష్మిత కొణిదెల నిర్మాతగానే కాకుండా కాస్ట్యూమ్స్ డిజైనర్గానూ వర్క్ చేశారు.