Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ బేబీ', 'గూఢచారి', 'వెంకీ మామ', 'కుడి ఎడమైతే', 'రాజ రాజ చోర', 'బ్లడీ మేరీ' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల నిర్మాణంతో ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
తాజాగా ఈ సంస్థ మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. 'విట్ నెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక నేరం గురించి వింటుంటాం, మరుసటి రోజు మరచిపోతుంటాం. ఇది కూడా అలాంటి నేరమే. కానీ కొన్ని కారణాలు ఈ నేరాన్ని మరచిపోనివ్వకుండా చేస్తున్నాయి. దీనిపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ మంచితనం ముసుగేసుకున్న ఎందరో నిజస్వరూపాలను బహిర్గతం చేస్తుంది. పారిశుద్ధ్య కార్మికుల కేంద్రంగా రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రం మెట్రోపాలిటన్ నగరాలు, వాటి కింద ఉన్న అదశ్య కారిడార్లతో మునుపెన్నడూ చూడని దశ్యాన్ని అందిస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది.
మే డే శుభాకాంక్షలతో తాజాగా విడుదల చేసిన 'విట్ నెస్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తున్నారు. అలాగే డ్రైనేజ్ పిట్ నుంచి సాయం కోరుతున్నట్లుగా ఒక చెయ్యి కనిపించడం పోస్టర్లో చూడొచ్చు. ఈ సినిమాలో ఆర్కిటెక్ట్గా కనిపించనున్న శ్రద్ధా శ్రీనాథ్ ఓ మంచి ఆశయం కోసం పోరాడుతుంది. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణితో పాటు ఈ చిత్రంలో షణ్ముగరాజా, జి.సెల్వ, రాబర్ట్, రాజీవ్ ఆనంద్, ఎం.ఏ.కె.రామ్ కూడా నటించారు. టి.జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపక్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గానే కాకుండా దర్శకుడిగానూ పని చేసున్నారు. ముత్తువేల్, జెపి సానక్య స్క్రీన్ప్లే అందించిన ఈ చిత్రానికి ఎడిటర్గా ఫిలోమిన్ రాజ్, సంగీత దర్శకుడిగా రమేష్ తమిళమణి బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, త్వరలో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్లోకి అడుగుపెడుతుండటం విశేషంగా భావిస్తున్నాం' అని మేకర్స్ అన్నారు.